న్యూఢిల్లీ : దేశాన్ని ఆక్సిజన్ కొరత పట్టిపీడిస్తోంది. కరోనా బారిన పడ్డ రోగులకు సకాలంలో ఆక్సిజన్ అందక చనిపోతున్నారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా గత 24 గంటల్లో 25 మంది రోగులు చనిపోయినట్లు ఈ ఉదయం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మరో 60 మంది రోగుల పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, సకాలంలో ఆక్సిజన్ అందకపోతే వారిని ప్రాణాలతో కాపాడటం కష్టమని పేర్కొన్నారు.
రెండు గంటలకు సరిపడ ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. మ్యానువల్ వెంటిలేషన్ ద్వారా ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డుల్లో రోగులకు చికిత్స చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఆక్సిజన్ కొరత కారణంగా రోగులు చనిపోయినట్లు ఈ ఉదయం 8 గంటలకు ప్రకటించగా, ఆ తర్వాత రెండు గంటలకు ఆక్సిజన్ ట్యాంకర్లు ఆస్పత్రికి చేరుకున్నాయి. రోగులు చనిపోవడానికి ఆక్సిజన్ కొరత ఒక్కటే కారణం కాదు. కరోనా లక్షణాలు తీవ్రమైన తర్వాత చివరి దశలో ఆస్పత్రికి వస్తున్నారని, తద్వారా మరణిస్తున్నారని ఆస్పత్రి చైర్మన్ డీఎస్ రాణా తెలిపారు.
25 sickest patients have died in last 24 hrs at the hospital. Oxygen will last another 2 hrs. Ventilators & Bipap not working effectively. Need Oxygen to be airlifted urgently. Lives of another 60 sickest patients in peril: Director-Medical, Sir Ganga Ram Hospital, Delhi
— ANI (@ANI) April 23, 2021