ఛత్రపతి శంభాజీనగర్, నవంబర్ 14: మరాఠా రిజర్వేషన్ల కోసం మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఛత్రపతి శంభాజీనగర్ నగరంలో చోటుచేసుకున్నది. మర్లాక్ గ్రామానికి చెందిన దజీబా రాందాస్ కదమ్ (23) ఈ నెల 11న ఓ పని మీద నగరానికి వచ్చాడు. అనంతరం విషాన్ని తాగాడు.
ఇది గుర్తించిన స్థానికులు అతడిని దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ 12న మరణించాడు. మృతుడి వద్ద ఉన్న సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘నాకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉన్నది. ఏక్ మరాఠా.. లాక్ మరాఠా’ అని రాసి ఉన్నది.