‘రోజ్గార్ మేళా’లో భాగంగా 75 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామంటూ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఆర్భాటంగా ప్రకటించింది. అయితే, దేశవ్యాప్తంగా 21.8 కోట్ల మందికి ఇప్పటికిప్పుడు ఉపాధి అవసరమున్నదని ‘దేశ్ బచావో అభియాన్’ కుండబద్దలు కొట్టింది. 10 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని గత జూన్లో ప్రకటించిన ప్రధాని.. ఇప్పటివరకూ ఆ దిశగా ఒక్క చర్య కూడా చేపట్టలేదని మండిపడింది. కేవలం 75 వేల ఉద్యోగాల భర్తీని చేపట్టి బీజేపీ పరివారం ఆకాశమంత ప్రచారం చేయడమేంటని విశ్లేషకులు ధ్వజమెత్తుతున్నారు. హైదరాబాద్.