రాయ్పూర్: ఒక వ్యక్తిని యువకుడు హత్య చేశాడు. రక్తం మడుగుల్లో పడి ఉన్న మృతదేహం పక్కనే ఆ వ్యక్తి భార్యపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది (Chhattisgarh Murder). అంబికాపూర్కు చెందిన 42 ఏండ్ల సుఖ్లాల్ సోమవారం రాత్రి భార్యతో కలిసి ఇంట్లో నిద్రించాడు. 21 ఏండ్ల కార్తీక్ మధ్య రాత్రి వేళ ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇది గమనించిన సుఖ్లాల్ నిద్ర లేచాడు. కార్తీక్ను చూసిన అతడు, తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన కార్తీక్ కర్రతో సుఖ్లాల్ తలపై కొట్టాడు. దీంతో రక్తం ధారగా కారడంతో అతడు చనిపోయాడు.
కాగా, అనంతరం సుఖ్లాల్ భార్యను కార్తీక్ బెదిరించాడు. రక్తం మడుగుల్లో పడి ఉన్న భర్త మృతదేహం పక్కనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో నిందితుడు కార్తీక్ను అరెస్ట్ చేశారు. నేరాన్ని అతడు ఒప్పుకోవడంతో జైలుకు తరలించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.