చండీగఢ్: పంజాబ్లో కల్తీ మద్యం తాగి 21 మంది ప్రాణాలు కోల్పోయారు. సంగ్రూర్ జిల్లాలో పలు గ్రామాల్లో మద్యం తాగిన దాదాపు 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని దవాఖానలకు తరలించగా 21 మంది మృతి చెందారు. 17 మంది చికిత్స పొందుతున్నారు. బాధితులంతా రోజువారీ కూలీలు. కాగా, ఈ ఘటనపై వెంటనే నివేదిక అందించాలని శనివారం పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశించారు.మద్యంలో మిథనాల్ కలవడమే ఈ ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు.