జైపూర్: రాజస్థాన్లో కొత్తగా 21 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 43కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. ఇందులో 11 మంది జైపూర్కు, ఆరుగురు అజ్మీర్కు, ముగ్గురు ఉదయ్పూర్కు చెందిన వారని పేర్కొంది. రోగుల్లో ఒకరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అని వెల్లడించింది. కోవిడ్ లక్షణాలను గుర్తించిన వ్యక్తుల నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపిన తర్వాత ఒమిక్రాన్ ఉనికిని నిర్ధారించినట్లు రాజస్థాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఒమిక్రాన్ సోకిన వారిలో ఐదుగురు విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు కాగా, మరో ముగ్గురు విదేశీ ప్రయాణికులతో పరిచయం కలిగి ఉన్నారని వెల్లడించింది.