అహ్మాదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్న విషయం తెలిసిందే. అయితే తొలి దశ ఎన్నికల్లో 89 సీట్ల కోసం మొత్తం 788 మంది పోటీ చేస్తున్నారు. దాంట్లో 167 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) తన రిపోర్ట్లో పేర్కొన్నది. 100 మందిపై మర్డర్, రేప్ లాంటి తీవ్రమైన కేసులు ఉన్నట్లు ఏడీఆర్ చెప్పింది. తొలి దశ అభ్యర్థుల్లో మొత్తం 21 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. దీంట్లో 13 శాతం మంది సీరియస్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
క్రిమినల్ అభ్యర్థులు ఉన్న జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఫస్ట్ ఉంది. ఆ పార్టీ తొలి దశలో 88 స్థానాల్లో పోటీ చేస్తోంది. దాంట్లో 36 శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 30 శాతం మందిపై రేప్, మర్డర్, కిడ్నాప్ కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి 35 శాతం, బీజేపీ నుంచి 16 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.