కర్నూల్: ఒకవేళ 2024లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాకుంటే, ఇక తనకు అదే చివరి ఎన్నిక అవుతుందని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూల్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్షోలో భావోద్వేగంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడుతానని గతంలో చంద్రబాబు ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే.
నేను తిరిగి అసెంబ్లీకి వెళ్లాలన్నా, నేను రాజకీయాల్లో ఉండాలన్నా, ఏపీకి న్యాయం జరగాలన్నా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాలని, లేదంటే అదే తనకు చివరి ఎన్నిక కానున్నట్లు చంద్రబాబు తెలిపారు. మీరు నన్ను దీవిస్తారా, నన్ను నమ్ముతున్నారు కదా అని బాబు రోడ్షోలో అన్నారు.