చెన్నై: ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కష్టాల్లో పడింది. కెప్టెన్ కోహ్లి (33), మ్యాక్స్వెల్ (39) వెంటవెంటనే అవుటయ్యారు. దీంతో ఆర్సీబీ 104 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. కోహ్లి, మ్యాక్స్వెల్ మూడో వికెట్కు 52 పరుగులు జోడించడంతో ఆర్సీబీ ఈజీగా గెలుస్తుందని భావించినా.. ఈ ఇద్దరూ వెంట వెంటనే పెవిలియన్ చేరడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. మ్యాక్స్వెల్ అవుటైన తర్వాత వచ్చిన షాబాజ్ కేవలం 1 పరుగు చేసి అవుటయ్యాడు. దీంతో ఆర్సీబీ 106 పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పోయింది.