ముంబై, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన బార్టి, సారథి, మహాజ్యోతి ఫెలోషిప్ పరీక్షపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2019 పరీక్షలో ఇచ్చిన ప్రశ్నపత్రాన్ని యథాతథంగా 2023 పరీక్షలో ఇచ్చారని చెప్పారు. పాత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేసిన విద్యార్థులు అధిక మారులు సాధించే అవకాశం ఉందన్నారు. ఈ ప్రశ్నపత్రాలు చిరిగిన కవరులో వచ్చాయని ఆరోపిస్తున్నారు. పేపర్ లీక్ అయ్యిందని, విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.