ముంబై: జీ ఎంటర్టైన్మెంట్ సంస్థ(Zee Company)లో సుమారు 2000 కోట్లు దారి మళ్లినట్లు తెలుస్తోంది. సోనీ గ్రూపు సంస్థతో ఇటీవల జీ కంపెనీ కలిసిన విషయం తెలిసిందే. సెక్యూర్టీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నిధుల దారిమళ్లింపుపై దర్యాప్తు చేపట్టింది. దానికి సంబంధించిన నివేదికను రిలీజ్ చేసింది. సుమారు 2000 కోట్లు ఆ కంపెనీ డైవర్ట్ చేసినట్లు తెలుస్తోందని సెబీ తెలిపింది. సెబీ అధికారులు అంచనా వేసి దాని కన్నా పది రెట్ల అమౌంట్ దారిమళ్లినట్లు సెబీ అంచనా వేస్తోంది. దారి మళ్లిన నిధులపై స్పష్టం లేదని, ఆ అమౌంట్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు సెబీ పేర్కొన్నది. జీ సంస్థ సీనియర్ అధికారులతో పాటు వ్యవస్థాపకులు సుభాశ్ చంద్ర, ఆయన కుమారుడు పునిత్ గోయంక, బోర్డు సభ్యులను సెబీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది.