న్యూఢిల్లీ: పాక్స్థాన్ చెరలో ఉన్న 200 మంది భారత జాలర్లకు విముక్తి లభించనున్నది. కరాచీ జిల్లాలోని మాలిర్లో ఉన్న జిల్లా కారాగారంలో మగ్గుతున్న వీరిని గురువారం పాక్ విడుదల చేయనున్నది. వాఘా సరిహద్దు వద్ద పాక్ అధికారులు జాలర్లను భారత్కు అప్పగించనున్నారు.
పాక్ విడుదల చేస్తున్న రెండో జాలర్ల బ్యాచ్ ఇది. మే 12న భారత్కు 198 మంది జాలర్లను పాక్ అధికారులు అప్పగించిన విషయం విదితమే. జూలై 3న మూడో బ్యాచ్కు చెందిన 100 మంది జాలర్లను అప్పగించే అవకాశం ఉన్నది. తమ ప్రాదేశిక జలాల్లో అక్రమంగా చొరబడ్డారనే ఆరోపణలపై జాలర్లను పాక్ అరెస్టు చేసి కారాగారాల్లో బంధిస్తున్నది.