శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. (Terrorists Killed) ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దక్షిణ కశ్మీర్ ప్రాంతమైన కుల్గామ్ జిల్లాలో గత రెండు రోజులుగా కొనసాగుతున్న రెండో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్గా ఆర్మీ అధికారులు తెలిపారు. రాజౌరి జిల్లాలోని కలకోట్ అటవీ ప్రాంతంలో కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య జరుగుతున్న ఎదురు కాల్పుల్లో తొలుత ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సరిహద్దులు దాటి పాకిస్థాన్ నుంచి భారత్లోకి ప్రవేశించిన ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ను తీవ్రతరం చేశారు.
కాగా, మరి కొందరు ఉగ్రవాదులు దాగి ఉంటారని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అలాగే ఉగ్రవాదులను గుర్తించేందుకు డ్రోన్లతో పాటు హెలికాప్టర్లను కూడా వినియోగిస్తున్నారు. ఉగ్రవాదులు తప్పించుకోకుండా అన్ని మార్గాలను దిగ్బంధించేందుకు అదనపు బలగాలను మోహరించారు.