BSF | న్యూఢిల్లీ : భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ఇద్దరు పాకిస్తాన్ డ్రగ్ స్మగ్లర్లను బీఎస్ఎఫ్ జవాన్లు మట్టుబెట్టారు. ఇండియా – పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు గుండా రాజస్థాన్లోని బార్మర్ వద్ద నుంచి సోమవారం అర్ధరాత్రి భారత్లోకి ప్రవేశించేందుకు ఆ ఇద్దరు దుండగులు యత్నించారు. పాక్ డ్రగ్ స్మగ్లర్ల కదలికలను పసిగట్టిన బీఎస్ఎఫ్ జవాన్లు.. అప్రమత్తమై వారిని కాల్చిచంపారు. ఇద్దరి నుంచి 3 కేజీల డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.