అహ్మదాబాద్ : గుజరాత్లోని బొటాడ్ జిల్లాతో పాటు అహ్మదాబాద్లోని పలు గ్రామాలకు చెందిన వ్యక్తులు కల్తీ మద్యం సేవించడంతో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో బొటాడ్ ఎస్పీ కరణ్ రాజ్ వాఘేలా, అహ్మదాబాద్ ఎస్పీ వీరేంద్ర సింగ్ యాదవ్లతో పాటు మరో ఆరుగురు పోలీసులను బదిలీ చేసినట్లు గుజరాత్ హోంశాఖ ప్రకటించింది.
మిథైల్ ఆల్కహాల్ లేదా మీథనాల్ను నీటిలో కలిపి.. మందు బాబులకు విక్రయించారు. ఒక్కో ప్యాకెట్ను రూ. 20 చొప్పున అమ్మారు. ఇక పలు గ్రామాలకు చెందిన మందు బాబులు ఆ ప్యాకెట్లను విక్రయించి సేవించారు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కల్తీ మద్యాన్ని విక్రయించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇక బొటాడ్, అహ్మదాబాద్ జిల్లాల ఎస్పీలు కల్తీ మద్యాన్ని నివారించడంలో పూర్తిగా విఫలమయ్యారని హోంశాఖ పేర్కొన్నది. విషపూరితమైన రసాయనాలను వాటర్లో కలిపి మద్యమని చెప్పి.. వ్యాపారం చేస్తున్న వారిని అడ్డుకోలేకపోవడాన్ని తప్పుబట్టింది. ఈ కల్తీ మద్యం సేవించిన మరో 97 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.