పుణె: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో హెలికాప్టర్ కూలింది(Helicopter Crash). ఆ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు, ఓ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోని హెరిటేజ్ ఏవియేషన్ ప్రైవేటు సంస్థకు చెందిన హెలికాప్టర్ అది. ఆక్స్ఫర్డ్ కౌంటీ గోల్ఫ్ కోర్సులోని హెలిప్యాడ్ నుంచి ఎగిరిన హెలికాప్టర్.. ముంబైలోని జూహుకు వెళ్తున్న సమయంలో కూలింది. ఇవాళ ఉదయం 7.40 నిమిషాలకు భవదాన్ ఏరియాలో ఉన్న కొండ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఆగస్టా హెలికాప్టర్ కూలిన సమయంలో భారీ మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో మృతిచెందిన వారిని గిరీశ్ కుమార్, ప్రీతమ్ సింగ్ భరద్వాజ్, పరంజీత్ సింగ్గా గుర్తించారు. మంచు కప్పేయడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటన పట్ల సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
Breaking News 🚨: Two people feared dead in a helicopter crash near Bavdhan in Pune district. More detail awaited: Pimpri Chinchwad Police official#Pune #PimpriChinchwad #Helicoptor #Helicoptorcrash #police #Bavdhan pic.twitter.com/Jk8F87tbGh
— Shino SJ (@Lonewolf8ier) October 2, 2024