శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో పోలీసులు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. శ్రీనగర్లోని (Srinagar) జకురా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని కశ్మీర్ ఐజీపీ వెల్లడించారు.
ఈ కాల్పుల్లో ఇద్దరు లష్కరే తొయిబా (Lashkar-e-Toiba) ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. అందులో ఒకరిని ఇఖాలక్ హాజమ్గా గుర్తించామని, అతడు అనంత్నాగ్లోని హస్సన్పొరాలో హెచ్సీ అలీ మొహద్ను కాల్చిచంపిన నిందుల్లో ఒకడని తెలిపారు. ఘటనా స్థలంలో పేలుడు పదార్థాలు, 2 తుపాకులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.