డెహ్రాడూన్: బాలల దినోత్సవం రోజున విషాదం జరిగింది. స్కూల్ పిల్లలను పిక్నిక్ను తీసుకెళ్లిన బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడు మరణించారు. ఉత్తరాఖండ్లోని సితార్గంజ్ జిల్లాలో సంఘటన జరిగింది. నయగావ్ భట్టే పరిధిలోని కిచ్చ ప్రాంతానికి చెందిన వేదారం స్కూల్ విద్యార్థులను చిల్డ్రన్స్ డే సందర్భంగా పిక్నిక్కు తీసుకెళ్లారు. 51 మంది పిల్లలున్న ఆ స్కూల్ బస్సు బోల్తా పడింది.
కాగా, పిల్లల హాహాకారాలతో ప్రమాదాన్ని గమనించిన స్థానికులు సహాయం కోసం వెంటనే ముందుకు వచ్చారు. అధికారులకు సమాచారం ఇవ్వగా వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఒక బాలిక, ఒక టీచర్ చనిపోయారు. పలువురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థిని, టీచర్ మరణంపై సంతాపం తెలిపారు. గాయపడిన విద్యార్థులకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.