న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలు అందించే యాక్సెంచర్ సంస్థ 19 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు గురువారం ప్రకటించింది. సవాలుగా మారిన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, తక్కువ రెవెన్యూ వృద్ధి వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.
2023 ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన ఈ సంస్థ వార్షిక రెవెన్యూ వృద్ధి, ఆదాయ అంచనాలను కూడా తగ్గించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఖర్చులు తగ్గించుకోనున్నట్టు సంస్థ సీఈవో జూలీ స్వీట్ తెలిపారు. కాగా, యాక్సెంచర్ భారత్ కేంద్రంగానే పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో ఈ లేఆఫ్ల ప్రభావం భారతీయ టెక్ ఉద్యోగులపై ఎక్కువగానే పడే ప్రమాదం కనిపిస్తున్నది.