చండీగఢ్: హర్యానాలోని యమునా నగర్, అంబాలా జిల్లాల్లో కల్తీ మద్యం తాగి ఇటీవల 19 మంది ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఇలాంటి సంఘటనల నుంచి పాఠాలు నేర్చుకోవడంలో ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. ఓ కాంగ్రెస్ నేత కుమారులు, జన నాయక్ జనతా పార్టీ నేత కుమారులు అరెస్టయినవారిలో ఉన్నారు.