న్యూఢిల్లీ: 3 సంవత్సరాలు, 17 మంది డాక్టర్లు.. ఒక నాలుగేండ్ల బాబుకు వచ్చిన జబ్బు ఏంటో గుర్తించలేకపోయారు. కానీ, ఈ పనిని కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో సంచలనంగా మారిన చాట్జీపీటీ సులువుగా చేసిపెట్టింది. వివరాల్లోకెళ్తే.. కోర్ట్నీ అనే మహిళ కుమారుడు అలెక్సాకు కరోనా సంక్షోభ సమయంలో అనారోగ్యం తలెత్తింది. ఏం తిన్నా విపరీతమైన పంటి నొప్పి రావడంతో పాటు ఎత్తు పెరగకపోవడం వంటి లక్షణాలు కనిపించాయి.
బాలుడికి వచ్చిన జబ్బు ఏంటో వైద్యులు కనిపెట్టలేకపోయారు. తల్లి.. ఓ రోజు చాట్జీపీటీ సాయం కోరింది. ఎంఆర్ఐ రిపోర్టుతోపాటు బిడ్డకున్న లక్షణాలను పంచుకొన్నది. బాలుడు ‘టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్’ అనే అరుదైన న్యూరోలాజికల్ కండిషన్తో బాధపడుతున్నట్టు చాట్జీపీటీ గుర్తించింది.