Explotion : తమిళనాడు (Tamil Nadu) లో ఘోరం జరిగింది. పటాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు చోటుచేసుకుంది. విరుద్నగర్ జిల్లా (Virudhnagar district) లోని ఓ బాణసంచా పరిశ్రమ (Fire works factory) లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 17 మంది మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఘటనాస్థలంలో ఇంకా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక బృందాలు.. మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాయి. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మంత్రులను ఆదేశించారు.