భోపాల్ : మధ్యప్రదేశ్ తికమ్గర్హ్ జిల్లాలోని ఓ ఇసుక క్వారీలో 164 పురాతన నాణేలు లభ్యమయ్యాయి. ఈ నాణేలు మొఘలుల కాలం నాటివి అని అధికారులు పేర్కొన్నారు. ఇసుక క్వారీలో పనులు చేస్తుండగా ఓ కుండ బయటపడింది. దీంట్లో పురాతన నాణేలు లభించినట్లు అధికారులు తెలిపారు.
బుందేల్ఖాండ్ రీజియన్లో ఓ ప్రవేయిటు కాంట్రాక్టర్కు చెందిన మైనింగ్లో ఈ పురాతన నాణేలు లభ్యమైనట్లు జిల్లా మైనింగ్ అధికారి ప్రశాంత్ తివారి వెల్లడించారు. ఆ నాణేలు బయటపడ్డ ప్రదేశాన్ని పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు. 164 నాణేల్లో 12 వెండి నాణేలు ఉన్నాయని, మిగతావి కాపర్ నాణేలు అని తెలిపారు. ఈ నాణేలన్నింటిని జిల్లా ట్రెజరీ కార్యాలయానికి తరలించారు. బుందేల్ఖాండ్ రీజియన్లో ఒకప్పుడు ఆఫ్ఘన్స్, మొఘల్స్ తమ సామ్రాజ్యాన్ని నెలకొల్పారు.