ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు కూడా అధికంగా నమోదు అవుతున్నాయి. నవీ ముంబైలో 16 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. బాధిత విద్యార్థులంతా 8 నుంచి 11వ తరగతికి చెందినవారే. ఈ క్రమంలో ఆ స్కూల్లోని 600 మంది విద్యార్థులకు వైద్యారోగ్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి తండ్రి ఇటీవలే ఖతర్ నుంచి ఇండియాకు తిరిగొచ్చాడు.
ముందస్తు చర్యల్లో భాగంగా ఆ కుటుంబానికి కరోనా పరీక్షలు నిర్వహించగా, తండ్రికి నెగిటివ్గా, కుమారుడికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇక ఆ విద్యార్థితో సన్నిహితంగా మెలిగిన పిల్లలందరికీ కొవిడ్ టెస్టులు చేయగా, 16 మందికి కరోనా సోకినట్లు తేలింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 10,582 కరోనా కేసులు యాక్టివ్గా ఉండగా, ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 40కి చేరింది.