న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్లో సినిమా టికెట్ ధర రూ. 200కు తక్కువ ఉండదు. అయితే ఈ నెల 16న నేషనల్ సినిమా డేను పురస్కరించుకొని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపరాఫర్ ప్రకటించింది. ఆ రోజున కేవలం రూ. 75కే సినిమా చూడొచ్చని తెలిపింది. పీవీఆర్, ఐనాక్స్, సినీపోలీస్, కార్నివాల్, మిరాజ్, సిటీప్రైడ్, ముక్తా ఏ2, ఏషియన్, మూవీ టైమ్, వేవ్, ఎం2కే, డిలైట్.. ఇలా వివిధ మల్టీప్లెక్సుల్లోని ఎంపిక చేసిన 4 వేల స్క్రీన్స్లో ఈ ఆఫర్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. కరోనా లాక్డౌన్ తర్వాత ఆదరిస్తున్న ప్రేక్షకుల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. బాక్సాఫీస్ కౌంటర్లో బుకింగ్ చేసుకు న్నవారికి మాత్రమే ఈ డిస్కౌంట్ ఆఫర్ ఉండనున్నట్టు తెలుస్తు న్నది. పూర్తి వివరా లు తెలియాల్సి ఉన్నది.