బెంగళూరు, డిసెంబర్ 24: వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న నిర్వహించతలపెట్టిన ‘ఢిల్లీ చలో’ సన్నాహాల్లో భాగంగా వచ్చే నెలన్నర వ్యవధిలో దేశవ్యాప్తంగా మరో 15 కిసాన్ మహా పంచాయత్లు నిర్వహిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆదివారం వెల్లడించింది. ఇప్పటికే గత 15 రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆరు మహాపంచాయత్లు జరిపామని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత, రైతు రుణాల మాఫీ తదితర ఏడు ప్రధాన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఎస్కేఎం చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది.