న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 14,148 కరోనా (Corona) కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,28,81,179కి చేరాయి. ఇందులో 4,22,19,896 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,12,924 మంది మహమ్మారివల్ల మరణించగా, 1,48,359 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 30,009 మంది కరోనా నుంచి కోలుకోగా, 302 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇక మొత్తం కేసుల్లో 0.35 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.22 శాతానికి తగ్గిందని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా 1,76,52,31,385 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, ఇందులో నిన్న ఒక్కరోజే 30,49,988 మంది టీకా తీసుకున్నారని తెలిపింది.