రాంచీ: ఒక బాలిక ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నది. అక్కడి టాయిలెట్లో బిడ్డను ప్రసవించింది. కమోడ్లో పడేసి ప్లష్ చేసేందుకు ప్రయత్నించింది. కుదరకపోవడంతో టాయిలెట్ నుంచి బయటకు వచ్చింది. అయితే రక్తం మరకలు చూసిన కొందరు వ్యక్తులు వైద్య సిబ్బందిని అరెస్ట్ చేశారు. (Girl delivers in hospital toilet) జార్ఖండ్లోని గిరిడిహ్లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం గర్భవతి అయిన 14 ఏళ్ల బాలిక సదర్ ఆసుపత్రికి చేరుకున్నది. ఒక వార్డులోని టాయిలెట్లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆందోళనతో టాయిలెట్ నుంచి బయటకు వచ్చింది.
కాగా, టాయిలెట్ బయట, లోపల రక్తం మరకలు ఉండటాన్ని అక్కడున్న కొందరు వ్యక్తులు గమనించారు. ఏదో జరిగినట్లు అనుమానించి ఆసుపత్రి సిబ్బందిని అప్రమత్తం చేశారు. అయితే ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆ బాలికకు కళ్లు తిరుగడంతో అక్కడ పడిపోయింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్య సిబ్బందితో కలిసి టాయిలెట్ను తనిఖీ చేశారు. టాయిలెట్ కమోడ్లో ఇరుక్కున్న నవజాత శిశువును గమనించి రక్షించారు. ఆ బాలిక, పసికందును అంబులెన్స్లో చైతాడిహ్లోని మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. తల్లి, బిడ్డ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నదని డాక్టర్లు తెలిపారు. 14 ఏళ్ల బాలిక గర్భం దాల్చడం, శిశువుకు జన్మనివ్వడంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.