న్యూఢిల్లీ, ఆగస్టు 27: బిల్కిస్ బానో లైంగికదాడి దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ 130 మందికిపైగా మాజీ బ్యూరోక్రాట్లు శనివారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్కి బహిరంగ లేఖ రాశారు. ఈ ‘భయానక తప్పుడు నిర్ణయాన్ని’ సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేసి, దోషులను తిరిగి జైలుకు పంపాలని కోరారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున గుజరాత్లో చోటుచేసుకున్న పరిణామాలను మెజారిటీ భారత ప్రజలు వ్యతిరేకించినట్టుగానే తాము కూడా వ్యతిరేకిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
లేఖపై సంతకాలు చేసిన వారిలో ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ క్యాబినెట్ కార్యదర్శి కేఎం చంద్రశేఖర్, మాజీ విదేశాంగ కార్యదర్శులు శివశంకర్ మీనన్, సుజాతా సింగ్, కేంద్ర మాజీ హోం శాఖ కార్యదర్శి జీకే పిైళ్లె తదితరులు ఉన్నారు. బిల్కిస్ రేపిస్టుల విడుదలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ సర్కారుకు సుప్రీంకోర్టు గత 25న నోటీసులు జారీచేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.