న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 125 కేసులు నమోదయ్యాయి. గత ఆరు నెలల్లో ఇదే అత్యధిక సంఖ్య అని ఢిల్లీ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అయితే గత 24 గంటల్లో కరోనాతో ఎవరూ మరణిచంలేదని చెప్పారు. కాగా, పాజిటివిటీ రేటు గత మూడు రోజులుగా 0.2 శాతం మేర ఉన్నదన్నారు. ప్రస్తుతం 624 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని, 289 మంది హోమ్ ఐసొలేషన్లో ఉన్నట్లు అధికారులు వివరించారు. ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,42,515కు, కరోనా మరణాల సంఖ్య 25,102కు చేరిందని వెల్లడించారు.