అహ్మదాబాద్: గుజరాత్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. మోర్బి జిల్లాలోని జింజుడాలో 120 కేజీల హెరాయిన్ను గుజరాత్ ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు. పట్టుపడిన మాదకద్రవ్యాల విలువ రూ.600 కోట్ల వరకు ఉంటుందని సోమవారం తెలిపారు. ఈ డ్రగ్స్ పాకిస్థాన్ నుంచి అక్టోబర్ చివరి వారంలో నిందితులకు డెలివరీ అయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. పాక్కు చెందిన జహీద్ బాషిర్ బలోచ్ అనే వ్యక్తి పంపిన ఈ సరుకును నిందితులు అరేబియా సముద్రం మీదుగా భారత్కు తీసుకొచ్చారని పేర్కొన్నారు. 2019లో పట్టుబడిన 227 కేజీల డ్రగ్స్ కేసులో కూడా జహీద్ వాంటెడ్గా ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం గుజరాత్లోని ముంద్రా పోర్టులో అధికారులు దాదాపు 3 వేల కిలోల హెరాయిన్ను పట్టుకున్నారు.