న్యూఢిల్లీ, మార్చి 26: లోక్సభ ఎ న్నికల వేళ అస్సాంలోని సోనిట్పూర్ జిల్లా నేపాలి పామ్ గ్రామం ఇప్పుడు అందరి దృష్టినీ ఆ కర్షిస్తున్నది. కారణం ఇక్కడ ఒకే కుటుంబంలో ఏకంగా 1200 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నేతలు గ్రామానికి క్యూ కడుతున్నా రు.
గ్రామంలోని 300 కుటుంబా లు ఒకే వంశానికి చెందినవే. వారం తా రాన్ బహదూర్ తాపా వారసు లు. ప్రస్తుతం వారి సంఖ్య 2500 ఉండగా, అందులో 1200 మంది ఓటర్లు. ఐదుగురు భార్యలున్న ఆ యనకు 12 మంది కొడుకులు, 10 మంది కుమార్తెలు సంతానం. ఇప్పు డు వారి సంఖ్య 2500కు చేరింది.