న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: దేశంలో మరోసారి భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఢిల్లీ పోలీసులు మంగళవారం ఇద్దరు అఫ్ఘాన్ జాతీయులను అరెస్టు చేసి, వారిచ్చిన సమాచారం ఆధారంగా లక్నో (ఉత్తరప్రదేశ్)లోని ఓ గోడౌన్లో 312.5 కిలోల మెథాంపెటమైన్తోపాటు 10 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకొన్నారు. 606 బ్యాగుల్లో దాచిపెట్టిన ఈ మాదకద్రవ్యాల విలువ రూ.1,200 కోట్ల వరకు ఉంటుందని ఢిల్లీ స్పెషల్ సీపీ హెచ్జీఎస్ ధలీవాల్ వెల్లడించారు. నిందితులిద్దరూ 2016 నుంచి భారత్లో నివసిస్తున్నారని, ఇంత భారీగా మెథాంపెటమైన్ పట్టుబడటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని తెలిపారు.