Chariot collapses : కర్టాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని ఓ గుడిలో ఇవాళ అపశృతి చోటుచేసుకుంది. బెంగళూరు రూరల్ పరిధిలోని అనేకల్లో హుస్కుర్ మడ్డురమ్మ గుడిలో వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో 120 అడుగుల ఎత్తున్న రథం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు.
రథం కూలిపోయినప్పుడు అక్కడ వేలాది మంది భక్తులున్నారు. రథాన్ని తాళ్లతో కట్టి పైకి లేపడానికి ప్రయత్నించినపుడు అదుపు తప్పి కిందపడిపోయింది. ఎత్తయిన రథాల ఊరేగింపునకు హుస్కుర్ మడ్డురమ్మ టెంపుల్ చాలా ప్రఖ్యాతి చెందినది. దశాబ్దం క్రితం ఈ గుడి వార్షికోత్సవంలో వందల రథాలను ఊరేగించేవారు. అయితే ప్రస్తుతం ఈ సంఖ్య 10కి పడిపోయింది.