భోపాల్, అక్టోబర్ 18: రామనవమి సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఖర్గోస్ హింసాకాండలో జరిగిన నష్టానికిగానూ రూ.2.9 లక్షల పరిహారం చెల్లించాలని ఓ 12 ఏండ్ల బాలుడికి నోటీసు వచ్చింది.
ఏప్రిల్ 10న రామనవమి ఊరేగింపు సందర్భంగా ఒక గుంపు తన ఇంట్లో ప్రవేశించి దాడిచేయడంతో ఆస్తినష్టం జరిగిందని, ఇందులో బాలుడి ప్రమేయముందని వారి పొరుగింటిలో ఉండే ఓ మహిళ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. రూ.4.8 లక్షల పరిహారం చెల్లించాలని బాలుడితోపాటు తండ్రికీ నోటీసులు అందాయి.