శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ (Anantnag) జిల్లాలో చిరుతపులి (Leopard) కలకలం సృష్టించింది. అటవీ ప్రాంతం నుంచి దక్షిణ కశ్మీర్ జిల్లా అయిన అనంత్నాగ్లోని సల్లార్ (Sallar) గ్రామంలోకి వచ్చిన ఓ చిరుత పులి ప్రజలపై దాడి (Attack) చేసింది. దీంతో 12 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను దవాఖానకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంత్నాగ్లోని జీఎంసీ (GMC Hospital) దవాఖానకు తీసుకెళ్లారు. అయితే ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. చిరుత పులిని వెంటనే బంధించాలని, తమకు రక్షణ కల్పించాలని అటవీ అధికారులను కోరుతున్నారు.