ముంబై: మహారాష్ట్రలోని (Maharashtra) సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై (Samruddhi Expressway) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 12.30 గంటలకు ఔరంగాబాద్ జిల్లా (Aurangabad) వైజాపూర్ వద్ద ఎక్స్ప్రెస్వేపై వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రావెలర్ అదుపుతప్పి ఆగిఉన్న కంటైనర్ని (Container) వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో 12 మంది అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
మృతుల్లో ఓ బాలిక సహా ఆరుగురు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో ట్రావెలర్లో మొత్తం 35 మంది ఉన్నారని చెప్పారు. ఈ ఘటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.