హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ముగ్గురు దివ్యాంగులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం స్కూ టీలు అందజేశారు. కరీంనగర్ జిల్లా కుమ్మర్పల్లికి చెందిన శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కంఠినెపల్లివాసి ఉమామహేశ్, నారాయణపేట జిల్లా మరికల్కు చెందిన నరేశ్ తమను ఆదుకోవాలని కవితకు ట్వీట్ చేశారు. వారికి అభయమిచ్చిన కవిత.. స్కూటీలు అందించారు.