ముంబై: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భారీగా బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ స్మగ్లింగ్తో సంబంధం ఉన్న ఏడుగురు సూడాన్ దేశస్థులతో పాటు ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.51 కోట్ల విలువైన 101.7 కేజీల బంగారాన్ని, రూ.1.35 కోట్ల విలువైన భారత, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్టు మంగళవారం అధికారులు తెలిపారు. బంగారంలో చాలా భాగం పేస్ట్ రూపంలో ఉందని, ఇండో-నేపాల్ సరిహద్దు ద్వారా బంగారాన్ని మొదట పాట్నాకు తరలించారని వెల్లడించారు.