పుణె: మహారాష్ట్రలోని థానెలో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. మంగళవారం రాత్రి నిజాంమపురా ప్రాంతంలో భివండి (Bhiwandi) పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ కారులో వెయ్యి జిలటిన్ స్టిక్స్, అంతే మొత్తంలో డిటోనేటర్లు లభించాయి. దీంతో కారును సీజ్ చేసిన పోలీసులు, వాటిని తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
నింధితులను అల్పేష్ పాటిల్, పంకజ్ ఛవాన్, సమీర్ వేగ్దాగా గుర్తించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గతేడాది ఫిబ్రవరిలోనే ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబాని ఇంటివద్ద భారీమొత్తంలో జిలెటెన్ స్టిక్స్ లభించిన విషయం తెలిసిందే.