పంజాబ్ : ఎయిర్ ఇండియా విమానంలో కరోనా కలకలం సృష్టించింది. ఇటలీ నుంచి పంజాబ్లోని అమృత్సర్కు చేరుకున్న విమానంలో ప్రయాణికులు పెద్ద ఎత్తున కరోనా బారినపడ్డారు. 180 మందికిపైగా ప్రయాణికులతో ఇటలీలోని రోమ్ నుంచి ఎయిర్ ఇండియా విమానం పంజాబ్లోని అమృత్సర్ విమానాశ్రయానికి చేరుకున్నది. ఈ సందర్భంగా ప్రయాణికులందరికీ ఎయిర్పోర్ట్ అధికారులు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 125 మందికి పాజిటివ్గా తేలిందని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ వీకే సేథ్ పేర్కొన్నారు.