న్యూఢిల్లీ: భూతాపం రెండు డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటే, మానవుడి కార్యకలాపాల వల్ల ఏర్పడే పర్యావరణ మార్పులు రాబోయే శతాబ్దిలో దాదాపు 100 కోట్లమంది అకాల మరణాలకు దారితీస్తుందని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ ఒంటారియో పరిశోధకుల అధ్యయనం హెచ్చరించింది.
చమురు, సహజవాయు పరిశ్రమల నుండి వెలువడుతున్న కాలుష్యం 40 శాతానికిపైగా కార్బన్ ఉద్గారాలకు కారణమవుతున్నదని పేర్కొన్నది. ‘కార్బన్ ఉద్గార్గాల్ని తగ్గించే విధానాల్ని ప్రభుత్వాలు వేగవంతం చేయాల్సి ఉంటుంది. 1,000 టన్నుల శిలాజ ఇంధనం మండించిప్పుడల్లా..అది కోట్లాది మంది అకాల మరణాలకు దారితీస్తుంది’ అని ప్రొఫెసర్ పియర్స్ అన్నారు.