చండీగఢ్, ఆగస్టు 22: పిజ్జా ఆర్డర్ క్యాన్సిల్ చేసినందుకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు చండీగఢ్లోని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రూ.10 వేలు జరిమానా విధించింది. అలాగే ఫిర్యాదుదారుకు ఒక ఫ్రీ మీల్ అందజేయాలని ఆదేశించింది. చండీగఢ్కు చెందిన అజయ్శేఖర్ శర్మ ఈ ఫిర్యాదుచేశారు. జొమాటోలో ‘ఆన్టైమ్ ఆర్ ఫ్రీ డెలివరీ’ స్కీమ్ కింద రాత్రి 10.15 గంటల సమయంలో తాను ఫుడ్ ఆర్డర్ చేశానని, అయితే జొమాటో 10.30 గంటల సమయంలో తన ఆర్డర్ను క్యాన్సిల్ చేసిందని చెప్పారు. ఆ సమయంలో డెలివరీ చేయలేనప్పుడు అసలు బుకింగ్ తీసుకోకూడదని వాదించాడు. దీనితో ఏకీభవించిన కన్జూమర్ ఫోరం జొమాటోకు జరిమానా విధించింది.