లక్నో: ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్కు వెళ్తున్న పిల్లలపై ఓ వెర్రికుక్క దాడి చేసింది. ఈ దాడిలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. షామ్లీ జిల్లా కైరానా పోలీస్ స్టేషన్ పరిధిలోని జహన్పూర్ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ విద్యార్థులందరికి గ్రామంలోని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. వారిలో నలుగురికి గాయాలు తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సాధిక్ (4), మహక్ (4), ఇన్షా (10), శ్యామ్ (7) అనే చిన్నారులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. అయితే, చిన్నారులపై దాడిచేసి కరిచిన వెర్రికుక్కను గ్రామస్తులు వెంటాడి కొట్టి చంపారు.