నాసిక్: మహారాష్ట్రలో మళ్లీ కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆ రాష్ట్రానికి చెందిన పది మంది మంత్రులు, 20 ఎమ్మెల్యేలకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అసెంబ్లీ సమావేశాల వేళ నిర్వహించిన టెస్టింగ్లో ఎమ్మెల్యేలకు వైరస్ సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. ఇలాగే కేసులు పెరుగుతుంటే, ప్రభుత్వం మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇవాళ కేవలం మహారాష్ట్రలోనే 454 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వాస్తవానికి శీతాకాల అసెంబ్లీ సమావేశాలను సాధారణంగా నాగపూర్లో నిర్వహిస్తారు. కానీ కోవిడ్ మహమ్మారి వల్ల ఈ సారి ఆ సమావేశాలను ముంబైలో నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల వేళ మొత్తం 50 మంది వరకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.