న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పది జిల్లాల్లో అత్యధిక స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుణె, ముంబై, నాగపూర్, థానే, నాసిక్, ఔరంగబాద్, బెంగుళూరు అర్బన్, నాందేడ్, ఢిల్లీ, అహ్మద్నగర్ జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదు అయ్యారన్నారు. టాప్ టెన్ జిల్లాల్లో 8 ప్రభావిత జిల్లాలు కేవలం మహారాష్ట్రలో ఉన్నట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. వారానికి వైరస్ పాజిటివ్ రేటు దేశంలో 5.65 శాతంగా ఉంది. మహారాష్ట్రలో వారానికి సగటు రేటు 23 శాతంగా నమోదు అవుతోందని రాజేశ్ భూషణ్ తెలిపారు.