శికర్: రాజస్థాన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు. అదుపు తప్పిన ఎస్యూవీ కారు ఒక ద్విచక్ర వాహనాన్ని, అనంతరం ట్రక్కును ఢీకొట్టింది. పల్సనా-ఖండేల్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఎస్యూవీ మజీసాహెబ్కి దనీ ప్రాంతంలో అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో.. అందులో ప్రయాణిస్తున్న దంపతులు మృతి చెందారు. ఆ కారు డ్రిల్లింగ్ రిగ్ మిషన్తో వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎస్యూవీలో ఉన్న 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా పలువురు గాయపడ్డారు.