శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని (Jammu Kashmir) రాంబన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించారు. జమ్ము – శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ (Ramban) సమీపంలో ఓ కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 10 మంది అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్టీఆర్ఎఫ్, క్విక్ రెస్పాన్స్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కారును వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.