కర్ణాటకలో బడి బయట 10 లక్షల మంది
బెంగళూరు, జూలై 7: బీజేపీ పాలిత కర్ణాటకలో చిన్న పిల్లల భవిష్యత్తు అంధకారంలో మగ్గుతున్నది. 14 ఏండ్ల లోపు పిల్లలు ఏకంగా 10 లక్షల మంది చదువుకు దూరంగా బడి బయటే ఉన్నారు. అమికస్ క్యూరీ అనే స్వచ్ఛంద సంస్థ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే వివరాలను 2013లో కర్ణాటక హైకోర్టు ముందుంచినట్టు సీనియర్ అడ్వకేట్ ఫణీంద్ర తెలిపారు. కోర్టు ఇటీవలే దీనిపై విచారణ జరిపి ప్రభుత్వ తీరును ఎండగట్టింది.
సర్వేలో ఏముందంటే..
కర్ణాటక వ్యాప్తంగా 6 నుంచి 14 ఏండ్ల వయసున్న పిల్లలపై సర్వే నిర్వహించగా.. 14,338 మంది పిల్లలు బడికి వెళ్లట్లేదని తెలిసింది. 3 ఏండ్లు, అంతకంటే తక్కువ వయసున్న 4.54 లక్షల మంది పిల్లలు అంగన్వాడీల్లో కూడా చేరలేదు. 4 నుంచి 6 ఏండ్ల వయసున్న 5.33 లక్షల మంది పిల్లలు కూడా బడుల్లో చేరలేదు.