లక్నో: ఉత్తర్ప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో సోన్భద్ర జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. ఓబ్రా ప్రాంతంలోని బిల్లీ మార్కుండి మైనింగ్ ఏరియాలో శనివారం రాత్రి క్వారీలో (Stone Mine Collapse) ఒక భాగం కుప్పకూలింది. దీంతో ఒకరు మరణించారు. సుమారు 15 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తెచ్చేందుకు ఎస్డీఆర్ఎఫ్ (SDRF), ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు ఒక మృతదేహాన్ని బయటకు తీశారు.
క్వారీలోని ఒక గోడ కూలడం వల్లే కార్మికులు చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. అందులో కొంతమంది శిథిలాల కింద సజీవ సమాధి అయ్యారని తెలిపారు. ఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ (డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్), ఎస్పీతో పాటు అధికారులు చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం అదపు యంత్రాలు, సామాగ్రిని తెప్పించామని తెలిపారు.
#WATCH | Sonbhadra, UP | Visuals from the spot where around 15 people are feared trapped after a stone mine collapsed yesterday in Sonbhadra. NDRF and SDRF teams are at the spot. One body has been recovered. Rescue operations are underway.
(Source: NDRF) pic.twitter.com/0l7E4JL3kc
— ANI (@ANI) November 16, 2025